మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రభుత్వం క్లారిటీ..!!
- June 23, 2024
అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సమయంలోనే పెన్షన్ల పెంపు..అన్నా క్యాంటీన్లు..మెగా డీఎస్సీ పైన సంతకాలు చేసారు. ఇక, టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. దీని పైన తాజాగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. ఈ పథకం అమలు దిశగా తమ నిర్ణయాన్ని స్పష్టం చేసారు.
ఏపీలో మహిళలకు తాజాగా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రవాణా శాఖా మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వకరించారు. మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదన్నారు. ఉన్న బస్సులనే యథావిధిగా కొనసాగించారన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల తో పాటుగా ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత తమాపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం కసరత్తు తమ కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని మార్గదర్శకాలు త్వరలోనే రిలీజ్ అవుతాయన్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ పథకం పైన ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్దం చేసారు. అక్కడ ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకొని ఇక్కడ విధి విధానాలు ఖరారు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









