సీబీఐ చేతికి మళయాల నటుడు కళాభవన్ మణి మృతి కేసు
- June 12, 2016
అనుమానాస్పద స్థితిలో మరణించిన మళయాల నటుడు కళాభవన్ మణి కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేసు విచారణకు సీబీఐకి ఇవ్వాలని సిఫార్సు చేస్తూ, సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. ఆయన మరణం వెనకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరింది. మణి మరణించి మూడు నెలలు గడుస్తున్నా, మృతి వెనకున్న కారణం తెలియకపోవడం, పోలీసులకు ఒక్క ఆధారమూ లభించకపోవడం, మృతదేహంలో రసాయనాలు ఉన్నాయని వెల్లడి కావడంతో ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఆయన మృతి వెనుక గుర్తు తెలియని వ్యక్తుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ విచారణ నిజాన్ని తేలుస్తుందని భావిస్తున్నట్టు మణి సోదరుడు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







