నీట్ పరీక్షల వివాదం.. ఆందోళనలో యూఏఈ స్టూడెంట్స్..!
- June 24, 2024
యూఏఈ: అనేక మంది భారతీయ విద్యార్థుల మాదిరిగానే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్షపై ఆందోళనగా ఉన్నట్లు యూఏఈలో పలువురు విద్యార్థులు తెలిపారు. నీట్ ఎంట్రన్స్ అనేంది భారతదేశంలోని అతిపెద్ద ప్రవేశ పరీక్ష. ఇండియాలో మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే, ఇటీవల వెలువడిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించారు. వారిలో ఆరుగురు ఒకే కోచింగ్ సెంటర్కు చెందినవారు కాగా, పరీక్ష ప్రారంభం ఆలస్యం కావడంతో 1,500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు లభించాయి. గత సంవత్సరం కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే AIR 1 వచ్చింది. విద్యార్థి సంఘాల నిరసనలు ఇండియాను కుదిపేస్తోంది. పలు రాస్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్లు కేసులు నమోదు అవుతున్నాయి. "ఇది మాకు చాలా బాధాకరమైన సమయం." శంకరాసన్ అన్నారు. మరోవైపు జూన్ 23వ తేదీన (ఆదివారం) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-PG వాయిదా పడింది. ఇదిలా ఉండగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు ఆరు నగరాల్లో పునఃపరీక్ష జరిగింది. అందులో సగం మందే హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది.
తాజా వార్తలు
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







