న్యూ యార్క్ లో కూటమి విజయోత్సవ వేడుకలు
- June 25, 2024
అమెరికా: అమెరికా న్యూ యార్క్ లో తెలుగు తమ్ముళ్లు మరియు NDA సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజావిజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మరియు బిజెపి కూటమి సునామి సృష్టంచిన సంగతి అందరికి తెలిసిన సంగతే.
ఈ సందర్బంగా జూన్ 23 న న్యూ యార్క్ లోని జేరికో పట్నంలో వేడుకలు వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ మరియు దిలీప్ ముసునూరి కలసి పెద్దల సహకారంతో ఘనంగా నిర్వర్తించారు.
ఈవేడుకలో వక్తలు డా.తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వరావు బొడ్డు, అంజు కొండబోలు, డా.జగ్గారావు అల్లూరి, డా.పూర్ణచంద్రరావు అట్లూరి, డా.కృష్ణరెడ్డి గుజవర్తి , మాజీ తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి, సత్య చల్లపల్లి, ఉదయ్ దొమ్మరాజు, సుమంత్ రామిశెట్టి మరియు ఆర్గనైజర్లు వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ మరియు దిలీప్ ముసునూరి మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను, బాధ్యతను గుర్తు చేస్తు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్ని పనులు చేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేసారు.


తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







