లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
- June 26, 2024
న్యూ ఢిల్లీ: లోక్సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్ సభ సమావేశాలు మూడోరోజు బుధవారం ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నిక ప్రారంభమైంది. స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్ నాథ్ సింగ్ తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపర్చారు. ఇండియా కూటమి తరపున కె. సురేష్ పేరును శివసేన (UBT) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. అతని తీర్మానాన్ని పలువురు ఇండియా కూటమి ఎంపీలు బలపర్చారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. మూజువాణి ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో స్పీకర్ గా ఓంబిర్లా విజేతగా నిలిచారు. ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాజ్ ప్రకటించారు.
ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికైన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లా వద్దకు వెళ్లి అభినందించారు. ఆ తరువాత మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరు బిర్లాను స్పీకర్ చైర్ వద్దకు తోడ్కొని వెళ్లారు. అనంతరం మోదీ ఓం బిర్లాను స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు. ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నిక కావటం ఇది రెండోసారి. స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. 61ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్ లోని కోటా నుంచి మూడోసారి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తరువాత.. 17వ లోక్ సభకు స్పీకర్ గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఓటింగ్ ద్వారా ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







