సీతాఫలం ఫుడ్డింగ్
- June 12, 2016
కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు- ఒకటిన్నర కప్పు, కండెన్స్డ్ మిల్క్- 1 కప్పు, చైనా గ్రాస్- 10 గ్రాములు, పంచదార- 1/3 కప్పు.
తయారీ విధానం: చైనా గ్రాస్ను ఒక కప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీళ్ళతో సహా తక్కువ మంట మీద ఉంచి పూర్తిగా కరిగేవరకూ గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మరో గిన్నెలో పాలు, కండెన్స్డ్ మిల్క్ పోసి మరిగించి, పంచదార కూడా వేసి అది పూర్తిగా కరిగాక, ముందే మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసిన సీతాఫలం గుజ్జును వేయాలి. ఆ తరువాత ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ కరిగించి పెట్టుకున్న చైనా గ్రాస్ను కూడా వేసి మంట కట్టేయాలి. చల్లారాక చిన్న చిన్న గిన్నెల్లోకి తీసి ఫ్రిజ్లో పెట్టి చల్లగా తినాలి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







