అతిపెద్ద జాతీయ పతాకం చిరిగిపోయింది..
- June 12, 2016
రాజధానిలోని సంజీవయ్య పార్కులో జూన్ 2న సీఎం కేసీఆర్ ఎగరేసిన అతిపెద్ద జాతీయ పతాకం పది రోజులకే చిరిగిపోయింది. ఈ పతాకం ఏర్పాటు చేసిన సమయంలోనే ముందుజాగ్రత్త చర్యగా రెండు పతాకాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రెండోదాన్ని ఎగురవేశారు. ఇప్పుడు అది ఎన్ని రోజులుంటుందో తెలియక అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆరు జాతీయ పతాకాలను సిద్ధం చేయాలని నిర్ణయించుకుని.. తొలి పతాకాన్ని తయారు చేసిన ఖమ్మంలోని వ్యక్తికి మూడు పతాకాలకు ఆర్డరిచ్చారు.
ఇలాంటి భారీ పతాకాలను రూపొందించటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ కంపెనీకి మరో మూడు జెండాలకోసం ఆర్డర్ ఇచ్చారు. వెంటనే వాటిని పంపాలని కోరడంతో ఆదివారం నాటికి ముంబై నుంచి ఒక పతాకం వచ్చింది. త్వరలో అక్కడి నుంచి మరో రెండు, ఖమ్మం నుంచి మూడు పతాకాలు రానున్నాయి. భారీ వ్యయం ఇక్కడ ఏర్పాటు చేసిన పతాకాన్ని ప్రత్యేక పాలిస్టర్ వస్త్రంతో రూపొందించారు. 72 బై 108 ఫీట్ల మేర ఉన్న ఈ భారీ పతాకానికి రూ.1.15 లక్షల వ్యయమవుతోంది. కొద్దిపాటి చిరుగుతో దాన్ని తొలగిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. దీంతో నిబంధనల్లో మినహాయింపు మేరకు పాతదాన్ని మరమ్మతు చేసి మరోసారి వాడాలని నిర్ణయించారు. కాగా, పతాకం కోసం ఏర్పాటు చేసిన 291 అడుగుల ఎత్తయిన స్తంభం కూడా తొలుత స్వల్పంగా ఒరిగింది. 11 జాయిం ట్లతో రూపొందిన ఈ భారీ స్తంభం.. ఏర్పాటు సమయంలోనే ఒరిగిందని, ప్రస్తుతం దానికి గాలి వల్ల ఎలాంటి ఇబ్బంది క లగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పతాకం రాత్రి వేళ చీకటిలో ఉండకూడదనే నిబంధన ఉన్నందున ఒక్కోటి వెయ్యి వాల్టుల సామర్థ్యమున్న ఎనిమిది భారీ లైట్లనుఏర్పాటు చేశారు. దాంతో రాత్రి వేళ కూడా భారీ లైట్ల కాంతితో పతాకం ధగధగలాడుతోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







