ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- June 30, 2024
దుబాయ్: వాలంటీర్ గా వైద్యులు ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రతివారం వచ్చే వారికి ఉచిత వైద్య పరీక్షలు మరియు చికిత్సలను అందజేస్తున్నారు. గత రమదాన్ సందర్భంగా దుబాయ్లో తడవి హెల్త్ గ్రూప్ ప్రారంభించిన ఈ హ్యుమానిటీ కార్యక్రమం.. దుబాయ్లోని దేరా లోని తడవి హెల్త్ సెంటర్లో ఏడాది పొడవునా ప్రతి శుక్రవారం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు 1,000 మందికి పైగా పేద రోగులకు చికిత్స అందించారు. ఈ చొరవలో భాగంగా పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందని భారతదేశానికి చెందిన డాక్టర్. షిబ్నీ బషీర్ తెలిపారు. క్లినిక్ మేనేజర్ రమేష్చంద్ బాలగోవిందన్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించడానికి మరియు ఆర్థిక స్థోమత లేని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందించడానికి తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







