ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- June 30, 2024
దుబాయ్: వాలంటీర్ గా వైద్యులు ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రతివారం వచ్చే వారికి ఉచిత వైద్య పరీక్షలు మరియు చికిత్సలను అందజేస్తున్నారు. గత రమదాన్ సందర్భంగా దుబాయ్లో తడవి హెల్త్ గ్రూప్ ప్రారంభించిన ఈ హ్యుమానిటీ కార్యక్రమం.. దుబాయ్లోని దేరా లోని తడవి హెల్త్ సెంటర్లో ఏడాది పొడవునా ప్రతి శుక్రవారం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు 1,000 మందికి పైగా పేద రోగులకు చికిత్స అందించారు. ఈ చొరవలో భాగంగా పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందని భారతదేశానికి చెందిన డాక్టర్. షిబ్నీ బషీర్ తెలిపారు. క్లినిక్ మేనేజర్ రమేష్చంద్ బాలగోవిందన్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించడానికి మరియు ఆర్థిక స్థోమత లేని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందించడానికి తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన..ప్రత్యేకంగా సౌదీ పెవిలియన్..!!
- Q1లో స్థిరంగా ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్..!!
- దుబాయ్లో జూన్ 1నుంచి సాలిక్ వ్యాట్ నిబంధన..!!
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం









