2030 నాటికి దుబాయ్ లో 32 కొత్త మెట్రో స్టేషన్లు
- July 01, 2024
యూఏఈ: ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆదివారం దుబాయ్ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ను ఆమోదించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రయాణికుల కోసం మరిన్ని స్టేషన్లను అందుబాటులోకి తేనున్నారు. 2030 నాటికి 84 చదరపు కిలోమీటర్లలో ఉన్న 64 స్టేషన్లను 140 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ 96 స్టేషన్లకు పెంచడం ఈ విస్తరణ లక్ష్యం. ఈ ప్రణాళిక షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరియు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ దృష్టిలో భాగంగా తీసుకురానున్నారు. ప్రజా రవాణా వాటాను 45 శాతానికి పెంచడం, తలసరి కార్బన్ ఉద్గారాలను 16 టన్నులకు తగ్గించడం, నడకను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశాల నాణ్యతను మెరుగుపరచడం మరియు నీడ ఉన్న ప్రాంతాలను పెంచడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. మెట్రో డెవలప్మెంట్ ప్లాన్తో పాటు, కౌన్సిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఆమోదించారు. ఇది 2033 నాటికి దుబాయ్కి Dh650 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఉంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







