2030 నాటికి దుబాయ్ లో 32 కొత్త మెట్రో స్టేషన్లు
- July 01, 2024
యూఏఈ: ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆదివారం దుబాయ్ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ను ఆమోదించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రయాణికుల కోసం మరిన్ని స్టేషన్లను అందుబాటులోకి తేనున్నారు. 2030 నాటికి 84 చదరపు కిలోమీటర్లలో ఉన్న 64 స్టేషన్లను 140 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ 96 స్టేషన్లకు పెంచడం ఈ విస్తరణ లక్ష్యం. ఈ ప్రణాళిక షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరియు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ దృష్టిలో భాగంగా తీసుకురానున్నారు. ప్రజా రవాణా వాటాను 45 శాతానికి పెంచడం, తలసరి కార్బన్ ఉద్గారాలను 16 టన్నులకు తగ్గించడం, నడకను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశాల నాణ్యతను మెరుగుపరచడం మరియు నీడ ఉన్న ప్రాంతాలను పెంచడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. మెట్రో డెవలప్మెంట్ ప్లాన్తో పాటు, కౌన్సిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఆమోదించారు. ఇది 2033 నాటికి దుబాయ్కి Dh650 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఉంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







