చెఫ్ డి మిషన్గా గగన్ నారంగ్..
- July 09, 2024
న్యూ ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న విశ్వ క్రీడలు పారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభ వేడుకల్లో భారత చెఫ్ డి మిషన్ (అంతర్జాతీయ క్రీడా కార్యక్రమంలో జాతీయ జట్టుకు ప్రాధాన్యత వహించే వ్యక్తి)గా ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ను ఐఓసీ ఎంపిక చేసింది.
వెటరన్ బాక్సర్ మెరీకోమ్ వ్యక్తిగత కారణాలతో చెఫ్ ద మిషన్ పదవికి రాజీనామా చేసింది. దాంతో ఆమే స్థానంలో నారంగ్ భారత బృందాన్ని నడిపిస్తాడని ఐఓసీ వెల్లడించింది. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్తో కలిసి పీవీ సింధు భారత పతకధారిగా ఉంటుందని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. దాంతో భారత మహిళా అథ్లెట్ల పరేడ్ సమయంలో తెలుగు తేజం పీవీ సింధు పతకధారిగా వ్యవహరించనుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







