సౌదీలో అర మిలియన్ దాటిన నమోదిత ఆర్గాన్ డోనర్స్
- July 09, 2024
రియాద్: మరణించిన తర్వాత వారి అవయవాలను దానం చేయాలనుకునే వారి సంఖ్య సౌదీ అరేబియా మొత్తం 533,000 మంది దాతలకు చేరుకుందని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అందజేయడానికి అవయవ మార్పిడిపై పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. మరణానంతరం అవయవాలను దానం చేయాలనుకునే వారి సంఖ్య పరంగా సౌదీ రాజధాని రియాద్ అగ్రస్థానంలో ఉంది. దాదాపు 142,000 మంది దాతలతో, మక్కా 115,000 మంది దాతలతో రెండవ స్థానంలో నిలిచింది. 65,000 మందితో తూర్పు ప్రావిన్స్ మూడవ స్థానంలో ఉంది నజ్రాన్లో 1,500 మంది దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అధిపతి డాక్టర్ తలాల్ అల్-గౌఫీ తెలిపారు. సౌదీ అరేబియాలో అవయవ మార్పిడి ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుండి 2023 చివరి వరకు మొత్తం మార్పిడి చేసిన అవయవాల సంఖ్య 6,000 కంటే ఎక్కువగా ఉందని డాక్టర్ అల్-గౌఫీ వెల్లడించారు. అవయవ మార్పిడిలో సెంట్రల్ రీజియన్ అత్యధిక స్థాయిని సాధించిందని, దమ్మామ్ మరియు జెద్దా తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







