సౌదీలో అర మిలియన్ దాటిన నమోదిత ఆర్గాన్ డోనర్స్
- July 09, 2024
రియాద్: మరణించిన తర్వాత వారి అవయవాలను దానం చేయాలనుకునే వారి సంఖ్య సౌదీ అరేబియా మొత్తం 533,000 మంది దాతలకు చేరుకుందని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అందజేయడానికి అవయవ మార్పిడిపై పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. మరణానంతరం అవయవాలను దానం చేయాలనుకునే వారి సంఖ్య పరంగా సౌదీ రాజధాని రియాద్ అగ్రస్థానంలో ఉంది. దాదాపు 142,000 మంది దాతలతో, మక్కా 115,000 మంది దాతలతో రెండవ స్థానంలో నిలిచింది. 65,000 మందితో తూర్పు ప్రావిన్స్ మూడవ స్థానంలో ఉంది నజ్రాన్లో 1,500 మంది దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అధిపతి డాక్టర్ తలాల్ అల్-గౌఫీ తెలిపారు. సౌదీ అరేబియాలో అవయవ మార్పిడి ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుండి 2023 చివరి వరకు మొత్తం మార్పిడి చేసిన అవయవాల సంఖ్య 6,000 కంటే ఎక్కువగా ఉందని డాక్టర్ అల్-గౌఫీ వెల్లడించారు. అవయవ మార్పిడిలో సెంట్రల్ రీజియన్ అత్యధిక స్థాయిని సాధించిందని, దమ్మామ్ మరియు జెద్దా తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









