హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి..
- July 10, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి రాబోతోంది. ప్రస్తుతం దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి వాహనదారులకు అందుబాటులో ఉండగా, మీరాలం చెరువు ట్యాంకుపై మరో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి రానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ.381 కోట్ల వ్యవయంతో రెండేళ్లలో మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేలా హెచ్ఎండీఏ ఓ కన్సల్టెన్నీ ద్వారా ప్రతిపాదనలు సిద్ధి చేసింది.
మీరాలం ట్యాంక్ ఈస్ట్ సైడ్లో ఉన్న చింతల్మెంట్ రోడ్డు నుంచి ట్యాంక్ తూర్పున గల బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే 44ను కనెక్ట్ చేస్తూ బ్రిడ్జి నిర్మించనున్నారు. మెుత్తం నాలుగు లైన్లతో 2.65 కిలోమీటర్ల పొడువుతో ఈ హైలెవల్ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. వంతెన పైన రెండు చోట్ల 140 మీటర్లతో ప్రవేశానికి ర్యాంపులు ఏర్పాుట చేయనున్నారు. ఒక చోట 110 మీటర్లతో ఎగ్జిట్ ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. అలాగే కేబుల్ బ్రిడ్జిపై ఆకర్షణ కోసం అర్నమెంటల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు.
అలాగే మీరాలం చెరువు విశిష్టతను తెలియజేసేలా అక్కడ థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి సమీపంలోనే ల్యాండ్ స్కేప్ డెవలప్మెంట్, టూరిజానికి అనుగుణంగా సందర్శకులను ఆకట్టుకునేందుకు వ్యూ పాయింట్లు, సంస్కృతి, వారసత్వ నేపథ్యాన్ని తెలియజేసేందుకు వివిధ అభివృద్ది పనులు, సమాచార కేంద్రాలు ఏర్పాుట చేసేందుకు హెచ్ఎండీఏ రెడీ అయింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









