హత్రాస్లో ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి..16 మందికి గాయాలు
- July 11, 2024
రోడ్డు ప్రమాదాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఎన్ని రోడ్డు జాగ్రత్తలు పాటించినప్పటికీ అనుకోని ప్రమాదాలు మాత్రం అమాయకులను బలి తీసుకుంటున్నాయి. తాజాగా హత్రాస్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..16 మందికి గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీ కొన్నది. ఈ సంఘటన సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్రాస్లోని టోలి గ్రామంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును మియాంగాంజ్ నుంచి చండీగఢ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక చనిపోయిన వారిని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారిక ప్రకటన తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









