కేజ్రీవాల్కి ఊరట..మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
- July 12, 2024
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్లో పలు కీలక అంశాలతో పాటు సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు వాదించారు. తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ పిటిషన్ వేయగా…ఈ పిటిషన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కోర్టు. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైల్లోనే ఉండక తప్పదు. ఇదే కేసులో ఆయనను సీబీఐ విచారిస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 90 రోజుల పాటు కేజ్రీవాల్ జైల్లో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







