కేజ్రీవాల్కి ఊరట..మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
- July 12, 2024
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్లో పలు కీలక అంశాలతో పాటు సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు వాదించారు. తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ పిటిషన్ వేయగా…ఈ పిటిషన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కోర్టు. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైల్లోనే ఉండక తప్పదు. ఇదే కేసులో ఆయనను సీబీఐ విచారిస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 90 రోజుల పాటు కేజ్రీవాల్ జైల్లో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









