దుబాయ్ మాల్ సందర్శకులే లక్ష్యంగా చోరీలు.. ముఠా అరెస్ట్
- July 12, 2024
యూఏఈ: దుబాయ్ మాల్ కు వచ్చే సందర్శకులను లక్ష్యంగా చేసుకుని వారి విలువైన వస్తువులను చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఇటీవల అధికారుల బృందం పట్టుకుంది. ముఖ్యంగా దుబాయ్ మాల్ వంటి పర్యాటక ప్రదేశాలలో పిక్ పాకెటింగ్ పెరగడంతో సివిల్ డ్రెస్ లో ఉండే ప్రత్యేక బృందాన్ని దుబాయ్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న 23, 28, 45 మరియు 54 సంవత్సరాల వయస్సు గల నలుగురు వ్యక్తులతో కూడిన ముఠాను మార్చి 6న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కోర్టు పత్రాల ప్రకారం.. ముఠా సభ్యులు దుబాయ్ మాల్ డ్యాన్స్ ఫౌంటెన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సందర్శకులను ఏమర్చుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ సందర్శకురాలి మొబైల్ ఫోన్ను దొంగిలించడానికి ప్రయత్నించే క్రమంలో మఫ్టీ పోలీసులకు దొరికిపోయారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి ఒక నెల జైలు శిక్ష విధించి, అనంతరం దేశ బహిష్కరణ విధించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







