దుబాయ్ మాల్ సందర్శకులే లక్ష్యంగా చోరీలు.. ముఠా అరెస్ట్
- July 12, 2024
యూఏఈ: దుబాయ్ మాల్ కు వచ్చే సందర్శకులను లక్ష్యంగా చేసుకుని వారి విలువైన వస్తువులను చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఇటీవల అధికారుల బృందం పట్టుకుంది. ముఖ్యంగా దుబాయ్ మాల్ వంటి పర్యాటక ప్రదేశాలలో పిక్ పాకెటింగ్ పెరగడంతో సివిల్ డ్రెస్ లో ఉండే ప్రత్యేక బృందాన్ని దుబాయ్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న 23, 28, 45 మరియు 54 సంవత్సరాల వయస్సు గల నలుగురు వ్యక్తులతో కూడిన ముఠాను మార్చి 6న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కోర్టు పత్రాల ప్రకారం.. ముఠా సభ్యులు దుబాయ్ మాల్ డ్యాన్స్ ఫౌంటెన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సందర్శకులను ఏమర్చుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ సందర్శకురాలి మొబైల్ ఫోన్ను దొంగిలించడానికి ప్రయత్నించే క్రమంలో మఫ్టీ పోలీసులకు దొరికిపోయారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి ఒక నెల జైలు శిక్ష విధించి, అనంతరం దేశ బహిష్కరణ విధించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









