దుబాయ్ మాల్ సందర్శకులే లక్ష్యంగా చోరీలు.. ముఠా అరెస్ట్
- July 12, 2024
యూఏఈ: దుబాయ్ మాల్ కు వచ్చే సందర్శకులను లక్ష్యంగా చేసుకుని వారి విలువైన వస్తువులను చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఇటీవల అధికారుల బృందం పట్టుకుంది. ముఖ్యంగా దుబాయ్ మాల్ వంటి పర్యాటక ప్రదేశాలలో పిక్ పాకెటింగ్ పెరగడంతో సివిల్ డ్రెస్ లో ఉండే ప్రత్యేక బృందాన్ని దుబాయ్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న 23, 28, 45 మరియు 54 సంవత్సరాల వయస్సు గల నలుగురు వ్యక్తులతో కూడిన ముఠాను మార్చి 6న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కోర్టు పత్రాల ప్రకారం.. ముఠా సభ్యులు దుబాయ్ మాల్ డ్యాన్స్ ఫౌంటెన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సందర్శకులను ఏమర్చుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ సందర్శకురాలి మొబైల్ ఫోన్ను దొంగిలించడానికి ప్రయత్నించే క్రమంలో మఫ్టీ పోలీసులకు దొరికిపోయారు. కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి ఒక నెల జైలు శిక్ష విధించి, అనంతరం దేశ బహిష్కరణ విధించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







