సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపి కేబినెట్ భేటి
- July 16, 2024
అమరావతి: నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈభేటికి మంత్రులందరూ హాజరుకానున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ లోని కొన్ని పథకాలపై లోతుగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వంపై ప్రజల స్పందన ఎలా ఉందనే దానిపై కూడా చర్చించవచ్చని సమాచారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇప్పటి వరకు విడుదల చేసిన శ్వేతపత్రాలు, విడుదల చేయబోతున్న శ్వేతపత్రాలపై చర్చ జరుపుతారు.
మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ధరణి, వ్యవసాయం, ప్రజాపాలన, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, ఆరోగ్యం, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
తాజా వార్తలు
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్







