బైజూస్పై బీసీసీఐ పిటిషన్.. దివాలా ప్రక్రియకు అనుమతి
- July 16, 2024
బెంగళూరు: ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు మరో షాక్ తగిలింది. స్పాన్సర్షిప్ బకాయిల వ్యవహారంలో బీసీసీఐ దాఖలు చేసిన దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) బెంగళూరు బెంచ్ అనుమతించింది.
భారత క్రికెట్ టీమ్కు స్పాన్సర్షిప్నకు సంబంధించి రూ.160 కోట్లు చెల్లించలేదన్నది బీసీసీఐ ఆరోపణ.
బైజూస్ ఓ దశలో వెలుగు వెలిగినప్పుడు బీసీసీఐ స్పాన్సర్గా వ్యవహరించింది. 2023 నవంబర్ వరకు జెర్సీ స్పాన్సర్గా బైజూస్ వ్యవహరించాల్సిఉండగా.. అర్ధంతరంగా అది వైదొలిగింది. ఈనేపథ్యంలో కాంట్రాక్ట్ ముగిసినా రూ.160 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంపై గతేడాది నవంబర్లో బైజూస్పై ఎన్సీఎల్టీ కేసు నమోదైంది. అప్పట్లో బీసీసీఐతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఒక్క బీసీసీఐ మాత్రమే కాదు.. ఫిఫా, ఐసీసీ వంటి బ్రాండ్లకూ బీసీసీఐ స్పాన్సర్గా వ్యవహరించింది. 2023 నుంచి వాటి రెన్యువల్ను నిలిపివేసింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









