టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి..!
- July 16, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియామకమయ్యారు. ఆయన 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. డెప్యూటేషన్ పంపాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. దాంతో ఆయన డిప్యూడేషన్పై మూడేళ్లపాటు సేవలందించనున్నారు. ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిలెడ్ వైస్ చైర్మన్, ఎండీగా పని చేశారు. ఇదిలా ఉండగా.. ఐపీఎస్ అధికారి ఆకె రవికృష్ణను సైతం కేంద్రం ఆంధ్రప్రదేశ్కు పంపింది. రవికృష్ణ ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన కర్నూలు ఎస్పీగా సేవలు అందించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









