కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అరుదైన ఆహ్వానం!!
- July 17, 2024
ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, శ్రీకాకుళం టీడీపీ లోక్సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. ఆయన నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.
కేంద్రంలో కొత్తమంత్రి వర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు చోటు కల్పించారు.
అలాగే, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా (వైద్య ఆరోగ్యం), కె.రామ్మోహన్ నాయుడు (పౌర విమానయాన శాఖ), హెచ్.డి కుమార స్వామి (ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ), జితన్ రాం మాంఝీ (ఎంఎస్ఎంఈ), రాజీవ్ రంజన్ సింగ్ (పంచాయతీ రాజ్, పశుసంవర్థకం), జూయెల్ ఓరం (గిరిజన వ్యవహారాలు), అన్నపూర్ణాదేవి (మహిళా శిశు సంక్షేమ), చిరాగ్ పాశ్వాన్ (ఆహారశుద్ధి, పరిశ్రమలు)లను చేర్చారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







