ఒమన్‌ కాల్పులకు బాధ్యత వహిస్తూ ‘దాష్’ ప్రకటన..!

- July 17, 2024 , by Maagulf
ఒమన్‌ కాల్పులకు బాధ్యత వహిస్తూ ‘దాష్’ ప్రకటన..!

మస్కట్: ఒమన్‌లోని మసీదుపై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు దాడికి పాల్పడిన వారితో సహా కనీసం తొమ్మిది మంది మరణించిన ఘటనకు బాధ్యత వహిస్తూ దాష్(daesh) ఒక ప్రకటన విడుదల చేసింది. తుపాకీ దాడిలో మరణించిన వారిలో నలుగురు పాకిస్థానీయులు, ఒక భారతీయుడు మరియు ఒక పోలీసు అధికారి ఉన్నట్లు పాకిస్థానీ, భారత్ మరియు ఒమన్ అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందితో సహా వివిధ దేశాలకు చెందిన 28 మంది గాయపడ్డారని ఒమన్ రాయల్ పోలీసులు తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌లోని వాడి అల్ కబీర్ పరిసరాల్లోని ఇమామ్ అలీ మసీదులో సోమవారం సాయంత్రం దాడి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com