దుబాయ్ లో 256 మంది ప్రాపర్టీ బ్రోకర్లకు జరిమానా
- July 18, 2024
దుబాయ్: 2024 ప్రథమార్థంలో ప్రకటనల నిబంధనలు, షరతులను పాటించనందుకు 256 మంది ప్రాపర్టీ బ్రోకర్లకు జరిమానా విధించినట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్(DLD) తెలిపింది. రెగ్యులేటర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చట్టాలకు కట్టుబడినందుకు 1,200 కంటే ఎక్కువ చట్టపరమైన హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు వెల్లడించింది. 2024 ప్రథమార్థంలో DLD ఇన్స్పెక్టర్లు 450 క్షేత్ర తనిఖీలతోసహా మొత్తం 1,530 తనిఖీలు నిర్వహించారని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీలోని రియల్ ఎస్టేట్ నియంత్రణ విభాగం డైరెక్టర్ అలీ అబ్దుల్లా అల్ అలీ తెలిపారు.
“ఎమిరేట్లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రించే నిబంధనలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండేలా పర్యవేక్షణ, తనిఖీ యంత్రాంగాలను అభివృద్ధి చేయడంపై మేము నిరంతరం కృషి చేస్తాము. మార్కెట్ స్థిరత్వం మరియు అభివృద్ధిని నిర్వహించడానికి DLD జారీ చేసిన సూచనలు, ఆదేశాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని మేము అన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మరియు కంపెనీలను కోరుతున్నాము. DLD ఆమోదించని ఎటువంటి ఆస్తి ప్రకటనలకు రెస్పాండ్ కావొద్దని పిలుపునిస్తున్నాము.”అని అల్ అలీ అన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









