ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్..

- July 19, 2024 , by Maagulf
ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్..

మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పెద్ద బగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ యూజర్ల సిస్టమ్ స్క్రీన్లు నీలం రంగులోకి మారుతున్నాయి.

సోషల్ మీడియాలో ప్రజలు నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నారు. విండోస్ సిస్టమ్‌లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ లోపం కనిపిస్తుంది. దీని కారణంగా సిస్టమ్ ఉన్నట్లుండి క్లోజ్ అవుతుంది. ఈ బగ్ కారణంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ప్రభావితమయ్యాయి. దీని కారణంగా చాలా బ్యాంకుల పని నిలిచిపోయింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలి క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ తర్వాత ఈ బగ్ వచ్చిందని చెబుతున్నారు.

ఈ బగ్‌పై మైక్రోసాఫ్ట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీని వల్ల ఆస్ట్రేలియా యూజర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ బగ్ హార్డ్‌వేర్లో ఉందా లేదా సాఫ్ట్‌వేర్ లో ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఇటీవల కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశారని.. ఉన్న ఓఎస్ లను అప్‌డేట్‌ చేశారని చెప్పారు. ఆ తర్వాత కూడా వారికి కూడా ఈ సమస్య తలెత్తింది.

మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల సర్వర్‌లలో అంతరాయం కారణంగా, చాలా కంపెనీల విమానాలు టేకాఫ్ కాలేకపోయాయి. సాంకేతిక లోపాలతో విమానయాన సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు సిడ్నీ, పెర్త్ విమానాశ్రయాలలో కూడా చెక్-ఇన్ చేయలేరు. ఫ్లైట్‌రాడార్ 24 ట్రాకింగ్ డేటా సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌లలో విమానాలు నిలిచిపోయినట్లు చూపిస్తుంది. గ్లోబల్‌ టెక్నికల్‌ అంతరాయంతో కొన్ని ఎయిర్‌లైన్‌ కార్యకలాపాలు, టెర్మినల్‌ సేవలపై ప్రభావం పడిందని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌ ప్రతినిధి తెలిపారు. ముంబయి, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో కొన్ని ఆన్‌లైన్‌ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. స్పైస్‌జెట్‌ సైతం ఇదేతరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com