విమాన ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా చూడండి: ఎవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు
- July 19, 2024
శ్రీకాకుళం: మైక్రోసాఫ్ట్ లో టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు గాస్తున్నారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా పలు విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు… తన నియోజకవర్గమైన శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ లో వచ్చిన సమస్యతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అనుకోని సమస్యతో ఇబ్బంది వచ్చిందన్నారు.
విమానాశ్రయాల్లో వేచిచూస్తున్నవారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని.. అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరు సహనంతో ఉంటూ.. అధికారులకు సహకరించాలని కోరారు రామ్మోహన్ నాయుడు.
--సాగర్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల









