విమాన ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా చూడండి: ఎవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు
- July 19, 2024
శ్రీకాకుళం: మైక్రోసాఫ్ట్ లో టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు గాస్తున్నారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా పలు విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు… తన నియోజకవర్గమైన శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ లో వచ్చిన సమస్యతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అనుకోని సమస్యతో ఇబ్బంది వచ్చిందన్నారు.
విమానాశ్రయాల్లో వేచిచూస్తున్నవారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని.. అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరు సహనంతో ఉంటూ.. అధికారులకు సహకరించాలని కోరారు రామ్మోహన్ నాయుడు.
--సాగర్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!