మద్యం తాగి పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం..డ్రైవర్‌కు జరిమానా

- July 20, 2024 , by Maagulf
మద్యం తాగి పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం..డ్రైవర్‌కు జరిమానా

మనామా: మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు బహ్రెయిన్ కోర్టు ఒక వ్యక్తికి 1,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్,  పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించినందుకు నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. కేసు వివరాల ప్రకారం.. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై ఈ సంఘటన జరిగింది. నిందితుడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ మెటల్ అడ్డంకిని ఢీకొట్టాడు. 2014 నాటి ట్రాఫిక్ చట్టం నం. 23లోని ఆర్టికల్ 1/12, 10, 9/45, మరియు 2, 1/51 మరియు క్రిమినల్ ప్రొసీజర్స్ లాలోని ఆర్టికల్ 256 ఆధారంగా కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com