ఆహార భద్రతా పై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ కీలక నివేదిక..!
- July 20, 2024
దోహా: ప్రజలకు అందుబాటులో ఉండే వినియోగ వస్తువుల భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి 2024 మొదటి ఆరు నెలల్లో ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఆహార భద్రతా విభాగం అనేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు విడుదల చేసిన గణాంకాలు దిగుమతి చేసుకున్న ఆహారం, నిర్వహించిన తనిఖీల సంఖ్య, హాట్లైన్ ద్వారా వచ్చిన వినియోగదారుల ఫిర్యాదులు, ఆహార పదార్థాలు మరియు సంస్థలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలతో సహా దేశంలో ఆహార భద్రతకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను తెలిపాయి. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హమద్ పోర్ట్, అల్ రువైస్ పోర్ట్ మరియు అబూ సమ్రా ల్యాండ్ బోర్డర్లోని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లోని పోర్ట్ హెల్త్ అండ్ ఫుడ్ కంట్రోల్ సెక్షన్ 60,520 దిగుమతి చేసుకున్న ఆహార సరుకులను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా మొత్తం 985,676కిలోల నాన్ కంప్లైంట్ ఫుడ్ ఐటమ్స్ ను ధ్వంసం చేశారు.
ఆహార భద్రతా విభాగం రెస్టారెంట్లు, హోటళ్లు, సూపర్ మార్కెట్లు, ఆహార కర్మాగారాలు ఇతర వాటిలో సంబంధిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి 3,221 తనిఖీలను నిర్వహించింది. ఆహార సంస్థల సమ్మతిని నిర్ధారించడానికి మొత్తం 2,779 ఫాలో-అప్లు చేపట్టింది. ఆహార భద్రతా విభాగం ప్రయోగశాలల విభాగం 2024 ప్రథమార్థంలో 17,000 కంటే ఎక్కువ నమూనాలను విశ్లేషించింది. ఇందులో ఓడరేవులలో దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల నుండి 7,022 నమూనాలు కూడా ఉన్నాయి. అలాగే స్థానిక ఆహార సంస్థల నుండి సేకరించిన 10,064 నమూనాలన్నాయి. ప్రజారోగ్య రంగం కోసం ఏకీకృత కాల్ సెంటర్ నంబర్ (16000) ద్వారా అందిన 181 ప్రజా ఫిర్యాదులపై ఆహార భద్రత విభాగం స్పందించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







