పనిచేసే సంస్థలో చోరీ.. ప్రవాస ఉద్యోగిపై విచారణ
- July 21, 2024
కువైట్: కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)లో పనిచేస్తున్న 40 ఏళ్ల ప్రవాసుడు, అతని వాహనంలో 145 ఇనుప క్లిప్లను చోరీ చేసిన ఘటనలో అతన్ని విచారించడానికి అల్-ఖషానియా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు రెఫర్ చేశారు. ప్రవాసుడు KOCలో సెక్యూరిటీ మరియు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. అతను కంపెనీ ప్రధాన కార్యాలయం నుండి వస్తువులను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. అతని ప్రైవేట్ కారులో చోరీ వస్తువులను తరలిస్తుండగా గుర్తించారు. విచారణలో వస్తువులను దొంగిలించానని ప్రవాసుడు అంగీకరించాడని, గతంలో జరిగిన దొంగతనాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







