ఆందోళనలో ఒమన్లోని బంగ్లాదేశ్ నివాసితులు..!
- July 22, 2024
మస్కట్: ఒమన్లోని బంగ్లాదేశ్ ప్రవాసులు తమ స్వదేశంలో దిగజారుతున్న పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. అక్కడి నిరసనల్లో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ వారితో కమ్యూనికేషన్ కాలేకపోతున్నామని పలువురు బంగ్లాదేశీయులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ డౌన్ మరియు టెలిఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఒమన్లోని ప్రవాసులు స్వదేశంలో వారి కుటుంబీకుల సంక్షేమం గురించి తెలియక ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం తన ప్రిఫరెన్షియల్ హైరింగ్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నేతృత్వంలో చేపట్టిన నిరసనలు తీవ్ర హంసకు దారితీశాయి. ఇదిలా ఉండగా, ఒమన్లోని బంగ్లాదేశ్ ప్రవాసులు అధికారిక అనుమతి లేకుండా ఎటువంటి ప్రదర్శనలు లేదా సమావేశాలు నిర్వహించవద్దని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ ఛైర్మన్ సిరాజుల్ హక్ కోరారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







