ఆందోళనలో ఒమన్‌లోని బంగ్లాదేశ్ నివాసితులు..!

- July 22, 2024 , by Maagulf
ఆందోళనలో ఒమన్‌లోని బంగ్లాదేశ్ నివాసితులు..!

మస్కట్: ఒమన్‌లోని బంగ్లాదేశ్ ప్రవాసులు తమ స్వదేశంలో దిగజారుతున్న పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. అక్కడి నిరసనల్లో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ వారితో కమ్యూనికేషన్‌ కాలేకపోతున్నామని పలువురు బంగ్లాదేశీయులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.  ఇంటర్నెట్ డౌన్ మరియు టెలిఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఒమన్‌లోని ప్రవాసులు స్వదేశంలో వారి కుటుంబీకుల సంక్షేమం గురించి తెలియక ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం తన ప్రిఫరెన్షియల్ హైరింగ్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నేతృత్వంలో చేపట్టిన నిరసనలు  తీవ్ర హంసకు దారితీశాయి.  ఇదిలా ఉండగా, ఒమన్‌లోని బంగ్లాదేశ్ ప్రవాసులు అధికారిక అనుమతి లేకుండా ఎటువంటి ప్రదర్శనలు లేదా సమావేశాలు నిర్వహించవద్దని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ ఛైర్మన్ సిరాజుల్ హక్ కోరారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com