ఆందోళనలో ఒమన్లోని బంగ్లాదేశ్ నివాసితులు..!
- July 22, 2024
మస్కట్: ఒమన్లోని బంగ్లాదేశ్ ప్రవాసులు తమ స్వదేశంలో దిగజారుతున్న పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. అక్కడి నిరసనల్లో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ వారితో కమ్యూనికేషన్ కాలేకపోతున్నామని పలువురు బంగ్లాదేశీయులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ డౌన్ మరియు టెలిఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఒమన్లోని ప్రవాసులు స్వదేశంలో వారి కుటుంబీకుల సంక్షేమం గురించి తెలియక ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం తన ప్రిఫరెన్షియల్ హైరింగ్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నేతృత్వంలో చేపట్టిన నిరసనలు తీవ్ర హంసకు దారితీశాయి. ఇదిలా ఉండగా, ఒమన్లోని బంగ్లాదేశ్ ప్రవాసులు అధికారిక అనుమతి లేకుండా ఎటువంటి ప్రదర్శనలు లేదా సమావేశాలు నిర్వహించవద్దని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ ఛైర్మన్ సిరాజుల్ హక్ కోరారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









