ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా డైరెక్టర్ మారుతి కూతురు
- July 24, 2024
హైదరాబాద్: యూత్ ని టార్గెట్ చేసి చిన్న చిన్న సినిమాలతో హిట్స్ కొట్టిన డైరెక్టర్ మారుతి ఆ తర్వాత స్టార్ హీరోలతో కామెడీ సినిమాలు తీసి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ మారుతికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా సినిమా రంగం వైపు వస్తున్నారు. మారుతి ఇటీవల జామ్ జంక్షన్ అనే ఓ మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించిన కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు. ఆరు మ్యూజిక్ బ్యాండ్స్ తో సెప్టెంబర్ 6న ఓ కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు. అయితే ఈ ప్రోగ్రాంని మారుతి కూతురు హియ దగ్గరుండి చూసుకుంటుంది.
తాజాగా ఈ జామ్ జంక్షన్ ప్రోగ్రాంకి సంబంధించిన ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ మారుతి కూతురు హియ కూడా ఈవెంట్ కి వచ్చారు. దీంతో హియ పలు మీడియా సంస్థలతో ముచ్చటించింది. హియ మాట్లాడుతూ.. నేను చిన్నప్పట్నుంచి క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఆలోచించేదాన్ని. నాన్న వర్క్స్ లో కూడా హెల్ప్ చేసేదాన్ని. ఇంటర్ అయిపొయింది. త్వరలో అబ్రాడ్ కి వెళ్లి చదువుతాను. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి పని చేస్తున్నాను. నాకు నాగ్ అశ్విన్ వర్క్ అంటే ఇష్టం.ఎప్పటికైనా నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేయాలి.మా తమ్ముడు మ్యూజిక్ వైపు వెళ్తున్నాడు.ప్రస్తుతం డ్రమ్మర్స్, పియానో ప్లే చేస్తున్నాడు అని తెలిపింది.దీంతో మారుతి కూతురు అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుందా, కూతుర్ని కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ మారుతిని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









