టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
- July 24, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేశారు.అక్టోబరు నెలకు సంబంధించిన ఈ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేశారు.అలాగే, తిరుమల, తిరుపతిలో అక్టోబరు నెల గదుల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదలవుతుంది. అదే రోజున నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. http://ttdevasthanams.ap.gov.inవెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. ప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







