అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. షార్జా పాలకుడు
- July 26, 2024
యూఏఈ: షార్జా సివిల్ డిఫెన్స్ ప్రకారం.. అల్ దైద్ నగరంలోని షరియా మార్కెట్లో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటల కారణంగా మార్కెట్కు తీవ్ర నష్టం వాటిల్లింది.
షాపు యజమానులకు భారీ ఉపశమనం కలిగిస్తూ షార్జా పాలకుడు బాధిత వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ దుకాణాలను అందించాలని అధికారులను ఆదేశించారు. షార్జా పాలకుడు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమీ మూడు రోజుల్లో దుకాణాలు సిద్ధం చేసి బాధితులకు అందజేయాలన్నారు. శాశ్వత మార్కెట్ను నిర్మించే ప్రాజెక్ట్ను కూడా షేక్ డాక్టర్ సుల్తాన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన ఈ కాంప్లెక్స్లో కాంక్రీటుతో చేసిన 60కి పైగా వాణిజ్య దుకాణాలు ఉంటాయన్నారు. నష్టపోయిన దుకాణ యజమానులకు కొత్త మార్కెట్లో కొత్త షాపులతో నష్టపరిహారం చెల్లించాలని, నష్టపోయిన వారికి ఆర్థికంగా నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







