పోలీసులమని 1,800 ల్యాప్టాప్లు చోరీ.. ముఠా అరెస్ట్
- July 26, 2024
యూఏఈ: 1 మిలియన్ దిర్హామ్ కంటే ఎక్కువ విలువైన 1,840 ల్యాప్టాప్లను దొంగిలించిన నలుగురు అరబ్బుల ముఠాను షార్జాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ జరిగిన 48 గంటల లోపే వారిని పట్టుకున్నట్టు వెల్లడించారు. రవాణా సేవల సంస్థలో పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి, తాను ల్యాప్టాప్లను డెలివరీ చేసేందుకు వెళుతుండగా, పోలీసు అధికారులుగా నటిస్తూ ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఆ ముఠా తనను ఆపిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసం జరిగినట్లు సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్కు నివేదించిన రెండు రోజుల లోపే, షార్జా పోలీసులు అనుమానితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్ రెహమాన్ నాసర్ అల్ షమ్సీ తెలిపారు. నివాసితులు అత్యవసర పరిస్థితుల కోసం 999 మరియు అత్యవసరం కాని కేసుల కోసం 901కి డయల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









