పోలీసులమని 1,800 ల్యాప్టాప్లు చోరీ.. ముఠా అరెస్ట్
- July 26, 2024
యూఏఈ: 1 మిలియన్ దిర్హామ్ కంటే ఎక్కువ విలువైన 1,840 ల్యాప్టాప్లను దొంగిలించిన నలుగురు అరబ్బుల ముఠాను షార్జాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ జరిగిన 48 గంటల లోపే వారిని పట్టుకున్నట్టు వెల్లడించారు. రవాణా సేవల సంస్థలో పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి, తాను ల్యాప్టాప్లను డెలివరీ చేసేందుకు వెళుతుండగా, పోలీసు అధికారులుగా నటిస్తూ ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఆ ముఠా తనను ఆపిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసం జరిగినట్లు సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్కు నివేదించిన రెండు రోజుల లోపే, షార్జా పోలీసులు అనుమానితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్ రెహమాన్ నాసర్ అల్ షమ్సీ తెలిపారు. నివాసితులు అత్యవసర పరిస్థితుల కోసం 999 మరియు అత్యవసరం కాని కేసుల కోసం 901కి డయల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







