పోలీసులమని 1,800 ల్యాప్‌టాప్‌లు చోరీ.. ముఠా అరెస్ట్

- July 26, 2024 , by Maagulf
పోలీసులమని 1,800 ల్యాప్‌టాప్‌లు చోరీ.. ముఠా అరెస్ట్

యూఏఈ: 1 మిలియన్ దిర్హామ్ కంటే ఎక్కువ విలువైన 1,840 ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన నలుగురు అరబ్బుల ముఠాను షార్జాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ జరిగిన 48 గంటల లోపే వారిని పట్టుకున్నట్టు వెల్లడించారు. రవాణా సేవల సంస్థలో పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి, తాను ల్యాప్‌టాప్‌లను డెలివరీ చేసేందుకు వెళుతుండగా, పోలీసు అధికారులుగా నటిస్తూ ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఆ ముఠా తనను ఆపిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   మోసం జరిగినట్లు సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్‌కు నివేదించిన రెండు రోజుల లోపే, షార్జా పోలీసులు అనుమానితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్ రెహమాన్ నాసర్ అల్ షమ్సీ తెలిపారు.  నివాసితులు అత్యవసర పరిస్థితుల కోసం 999 మరియు అత్యవసరం కాని కేసుల కోసం 901కి డయల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com