ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- July 26, 2024
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం వరకు కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది. డిమాండ్ లేని బ్రాంచీల స్థానంలో సీఎస్ఈ తదితర బ్రాంచీల నుంచి 7 వేల సీట్లు, అదనపు సీట్లతో కలిపి కొత్తగా 20,500 సీట్లు అందుబాటులోకి రావాలి. ఇందుకు ఏఐసీటీఈ కూడా ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కౌన్సెలింగ్లో 2,600 సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. తాజాగా రెండో విడతకు సుమారు 9 వేల సీట్లు మంజూరు చేస్తున్నది. వీటికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు. ఇక తొలివిడత కౌన్సెలింగ్లో మొత్తం 75,200 మందికి బీటెక్ సీట్లు వచ్చాయి. వీళ్లు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసింది. ఈ గడువులో దాదాపు 55 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మిగతా 20 వేల మంది సీట్లు వదులుకున్నారు. అయితే వీళ్లలో చాలామంది మేనేజ్మెంట్ కోటాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







