‘బచ్చన్’ భామ సొంత గొంతుతో అప్పుడేనా.?
- July 31, 2024
ఒకప్పుడు హీరోయిన్లు డబ్బింగ్ని ఆశించేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మలు తెలుగు భాషను కష్టపడి నేర్చేసుకుంటున్నారు. తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటామంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ నార్త్ భామలైన రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్ధే తదితరులు అలాగే మలయాళ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, కన్నడ కస్తూరి రష్మిక ఇలా తదితర టాలెంటెడ్ భామలు సైతం వారి వారి పాత్రలకు వారే సొంత డబ్బింగ్ చెప్పుకోవడం విన్నాం.
ఇప్పుడు అదే లిస్టులోకి కొత్త బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా చేరిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమవుతోంది ఈ అందాల భామ. తొలి సినిమాకే తన డబ్బింగ్ తానే చెప్పుకుందట.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా తొలి సినిమా రిలీజ్ కాకుండానే తెగ ట్రెండింగ్ అయిపోయింది భాగ్యశ్రీ బోర్సే. తనదైన అందచందాలు, ఆటిట్యూడ్తో తెలుగు ప్రేక్షకుల్ని బుట్టలో వేసేసుకుంది.
‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్తో కలిసి భాగ్యశ్రీ వేస్తున్న డాన్సులతో మరింత ట్రెండింగ్ అవుతోంది. ఈ డాన్సింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







