‘బచ్చన్’ భామ సొంత గొంతుతో అప్పుడేనా.?
- July 31, 2024
ఒకప్పుడు హీరోయిన్లు డబ్బింగ్ని ఆశించేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మలు తెలుగు భాషను కష్టపడి నేర్చేసుకుంటున్నారు. తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటామంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ నార్త్ భామలైన రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్ధే తదితరులు అలాగే మలయాళ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, కన్నడ కస్తూరి రష్మిక ఇలా తదితర టాలెంటెడ్ భామలు సైతం వారి వారి పాత్రలకు వారే సొంత డబ్బింగ్ చెప్పుకోవడం విన్నాం.
ఇప్పుడు అదే లిస్టులోకి కొత్త బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా చేరిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమవుతోంది ఈ అందాల భామ. తొలి సినిమాకే తన డబ్బింగ్ తానే చెప్పుకుందట.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా తొలి సినిమా రిలీజ్ కాకుండానే తెగ ట్రెండింగ్ అయిపోయింది భాగ్యశ్రీ బోర్సే. తనదైన అందచందాలు, ఆటిట్యూడ్తో తెలుగు ప్రేక్షకుల్ని బుట్టలో వేసేసుకుంది.
‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్తో కలిసి భాగ్యశ్రీ వేస్తున్న డాన్సులతో మరింత ట్రెండింగ్ అవుతోంది. ఈ డాన్సింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







