దాదాపు 100 మందిని కోల్పోయిన యూఏఈ ప్రవాసుడు..!
- August 01, 2024
యూఏఈ: షాజహాన్ కుట్టియాత్కి కేరళలోని తన స్వస్థలానికి వెళ్లే ప్రతి పర్యటన ఆనందం కలిగించేది. కానీ ఇప్పుడు, పరిస్థితులు మారిపోయాయి. మంగళవారం వయనాడ్ జిల్లాలో కొండచరియలు పడ్డ ఘటనలో అతని గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అతని కుటుంబం మరియు స్నేహితులు 100 మందికి పైగా ఆచూకీ గల్లంతయిందని వాపోయాడు. ఇందులో కొందరు చనిపోగా, మరికొందరు గల్లంతయ్యారని కన్నీటిపర్యంతమయ్యాడు. "నా తల్లిదండ్రులు, భార్య మరియు కుమార్తెలు సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే వారు కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి అర కిలోమీటరు దూరంలో నివసిస్తున్నారు. కానీ నా కుటుంబ సభ్యులలో 90 మందికి పైగా మరణించారు." అని అతను చెప్పాడు . “నా స్నేహితులు దాదాపు 12 మంది తప్పిపోయారు. నిజం చెప్పాలంటే, నా కుటుంబంలో ఎంత మంది సభ్యులు మిగిలి ఉన్నారో కూడా మాకు తెలియదు. అక్కడ ఉన్నవారిని కనుగొనడానికి ప్రజలు ఇప్పటికీ ఆసుపత్రులకు వెళుతున్నారు.’’ అని యూఏఈలో డ్రైవర్గా పనిచేస్తున్న 37 ఏళ్ల వ్యక్తి చూరల్మల తెలిపాడు. ఇది అత్యంత దెబ్బతిన్న ప్రాంతాలలో ఒకటి. "ప్రతి గంటకు, నేను సురక్షితంగా ఉన్నారని భావించిన వ్యక్తుల ఫోటోలు నాకు వస్తున్నాయి, కానీ తప్పిపోయినట్లు లేదా చనిపోయినట్లు తేలింది" అని అతను వాపోయాడు.
ఇదిలా ఉండగా, కేరళలో రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతుల సంఖ్య 158కి చేరుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







