రామ్ డైరెక్టర్తో రవితేజ సినిమా.!
- August 01, 2024
రామ్ పోతినేని కాంబినేషన్లో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్ తిరుమల. అందులో డెబ్యూ మూవీ ‘నేను శైలజ’ అటు రామ్కీ, ఇటు కిషోర్ తిరుమలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.
అదే స్పీడుతో ఆ తర్వాత ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు.ఈ సినిమా సో సోగానే ఆడింది. కానీ, ఓ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీలో వస్తే.. ఆనందంగా వీక్షించే ఆడియన్స్ వున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి ‘రెడ్’ సినిమా వచ్చింది ఇదే కాంబినేషన్లో. రామ్ పోతినేని డబుల్ రోల్ పోషించాడు ఈ సినిమాలో. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే, ‘రెడ్’ తర్వాత మరో మాస్ స్టోరీ రాసుకున్నాడట కిషోర్ తిరుమల.
ఆ స్టోరీ మీదే రెండేళ్లకు పైగా వర్క్ చేస్తున్నాడు. ఆ స్టోరీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఆగస్టు 15న రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. అలాగే రవితేజ చేతిలో గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఒకటి వుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









