రామ్ డైరెక్టర్తో రవితేజ సినిమా.!
- August 01, 2024
రామ్ పోతినేని కాంబినేషన్లో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్ తిరుమల. అందులో డెబ్యూ మూవీ ‘నేను శైలజ’ అటు రామ్కీ, ఇటు కిషోర్ తిరుమలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.
అదే స్పీడుతో ఆ తర్వాత ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు.ఈ సినిమా సో సోగానే ఆడింది. కానీ, ఓ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీలో వస్తే.. ఆనందంగా వీక్షించే ఆడియన్స్ వున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి ‘రెడ్’ సినిమా వచ్చింది ఇదే కాంబినేషన్లో. రామ్ పోతినేని డబుల్ రోల్ పోషించాడు ఈ సినిమాలో. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే, ‘రెడ్’ తర్వాత మరో మాస్ స్టోరీ రాసుకున్నాడట కిషోర్ తిరుమల.
ఆ స్టోరీ మీదే రెండేళ్లకు పైగా వర్క్ చేస్తున్నాడు. ఆ స్టోరీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఆగస్టు 15న రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. అలాగే రవితేజ చేతిలో గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఒకటి వుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







