రామ్ డైరెక్టర్తో రవితేజ సినిమా.!
- August 01, 2024
రామ్ పోతినేని కాంబినేషన్లో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్ తిరుమల. అందులో డెబ్యూ మూవీ ‘నేను శైలజ’ అటు రామ్కీ, ఇటు కిషోర్ తిరుమలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.
అదే స్పీడుతో ఆ తర్వాత ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు.ఈ సినిమా సో సోగానే ఆడింది. కానీ, ఓ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీలో వస్తే.. ఆనందంగా వీక్షించే ఆడియన్స్ వున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి ‘రెడ్’ సినిమా వచ్చింది ఇదే కాంబినేషన్లో. రామ్ పోతినేని డబుల్ రోల్ పోషించాడు ఈ సినిమాలో. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే, ‘రెడ్’ తర్వాత మరో మాస్ స్టోరీ రాసుకున్నాడట కిషోర్ తిరుమల.
ఆ స్టోరీ మీదే రెండేళ్లకు పైగా వర్క్ చేస్తున్నాడు. ఆ స్టోరీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఆగస్టు 15న రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. అలాగే రవితేజ చేతిలో గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఒకటి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







