ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ..!
- August 02, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. నూతన మద్యం విధానం రూపకల్పనపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.
రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 4 బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్ లు, ధరలు, మద్యం కొనుగోళ్లతో పాటు నాణ్యం, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నెల 12లోగా నివేదికలు సమర్పించాలని 4 అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
తాజా వార్తలు
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ







