ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు..పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు
- August 03, 2024
అమరావతి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఆయన్ను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ పలువురు ఆయనకు వినతులు సమర్పించారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కార్యాలయం కిక్కిరిసింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









