నవ్యాంధ్ర రాజధాని స్మార్ట్ సిటీల జాబితాలో..

- June 16, 2016 , by Maagulf
నవ్యాంధ్ర రాజధాని స్మార్ట్ సిటీల జాబితాలో..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తొలిసారిగా వెంకయ్యనాయుడు గురువారం విజయవాడ విచ్చేశారు.
అందులోభాగంగా విజయవాడ బీజేపీ కార్యాలయంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... తక్కువ ప్రీమియంకే రైతులకు పంటల బీమా చేస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... పోలవరం అథారటీ ద్వారానే ప్రాజెక్ట్ పనులు చేపడతామన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సాయం ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇస్తుందని హరిబాబు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com