దుబాయ్లో 3రోజులపాటు 'భారత్ ఉత్సవ్' ఫెస్టివల్
- August 05, 2024
యూఏఈః దుబాయ్లో భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడానికి 'భారత్ ఉత్సవ్ 2' ఫెస్టివల్ మళ్లీ వచ్చింది. ఈవెంట్ ఆగస్టు 15, 16 మరియు 17 తేదీల్లో షేక్ జాయెద్ రోడ్ లోని మెట్రోపాలిటన్ హోటల్లో జరుగనుంది. ఈ సందర్భంగా కళ, సాహిత్యం, నృత్యం,గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, ఫ్యాషన్, సినిమా, ఫుడ్ స్టాల్స్, ప్రదర్శనల ద్వారా భారత స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించనున్నారు. గత సంవత్సరం 310 మంది ప్రదర్శనకారులతో 108 కార్యక్రమాలు నిర్వహించగా, 1,500 మందికి పైగా భారత్ ఉత్సవ్ను సందర్శించారు.ఈవెంట్ ఆర్గనైజర్ వికాస్ భార్గవ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం యూఏఈలో ఉంటున్న భారతీయుల ద్వారా తమ సంస్కృతిని వివిధ కళారూపాల రూపంలో ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం భారత్ ఉత్సవ్ 2 ఎక్సలెన్స్ అవార్డు, వాక్ ఆర్ట్ మరియు భారత్ ఉత్సవ్ పాస్పోర్ట్లను పరిచయం చేస్తోందన్నారు.మా గల్ఫ్ న్యూస్ ఈవెంట్ మీడియా పార్టనర్ గా ఉంది.
తాజా వార్తలు
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!









