దుబాయ్లో 3రోజులపాటు 'భారత్ ఉత్సవ్' ఫెస్టివల్
- August 05, 2024
యూఏఈః దుబాయ్లో భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడానికి 'భారత్ ఉత్సవ్ 2' ఫెస్టివల్ మళ్లీ వచ్చింది. ఈవెంట్ ఆగస్టు 15, 16 మరియు 17 తేదీల్లో షేక్ జాయెద్ రోడ్ లోని మెట్రోపాలిటన్ హోటల్లో జరుగనుంది. ఈ సందర్భంగా కళ, సాహిత్యం, నృత్యం,గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, ఫ్యాషన్, సినిమా, ఫుడ్ స్టాల్స్, ప్రదర్శనల ద్వారా భారత స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించనున్నారు. గత సంవత్సరం 310 మంది ప్రదర్శనకారులతో 108 కార్యక్రమాలు నిర్వహించగా, 1,500 మందికి పైగా భారత్ ఉత్సవ్ను సందర్శించారు.ఈవెంట్ ఆర్గనైజర్ వికాస్ భార్గవ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం యూఏఈలో ఉంటున్న భారతీయుల ద్వారా తమ సంస్కృతిని వివిధ కళారూపాల రూపంలో ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం భారత్ ఉత్సవ్ 2 ఎక్సలెన్స్ అవార్డు, వాక్ ఆర్ట్ మరియు భారత్ ఉత్సవ్ పాస్పోర్ట్లను పరిచయం చేస్తోందన్నారు.మా గల్ఫ్ న్యూస్ ఈవెంట్ మీడియా పార్టనర్ గా ఉంది.
తాజా వార్తలు
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన







