బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..
- August 05, 2024
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికలతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో వంద మందికి పైగా మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి..
రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్ తో నిరసనకారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నిరసనల్లో వందల మంది (300 మందికి పైగా అని అధికారిక సమాచారం) మరణించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆమె సోదరితో కలిసి భారత్ లో ఆశ్రయం కోసం వస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









