సీఎం రేవంత్ నన్ను కాపాడండి...కువైట్ నుంచి బాధితుడి వీడియో!
- August 08, 2024
కువైట్ సిటీ: తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ బాధితులు విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సరైన ఉపాధి దొరకక చాలామంది.. యువకులు అలాగే, మిడిల్ ఏజ్డ్ వ్యక్తులు... గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా దుబాయ్, సౌదీ లేదా కువైట్ లాంటి ప్రాంతాలకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగిస్తారు.గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు... కొంతమంది బ్రోకర్ల మాటలు విని చాలామంది కార్మికులు మోసపోతున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు... మంచి హోటల్లో పని ఇప్పిస్తామని చెప్పి...గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత ఎడారిలో ఉంచుతున్నారు. అలా చాలామంది కార్మికులు.. ఏజెంట్ల... చేతిలో దారుణంగా మోసపోవడం జరుగుతోంది.
అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మల వాసి కూడా కువైట్ వెళ్లి మోసపోయాడు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కువైట్ లో తనను కొడుతున్నారని... తీవ్ర అవస్థలు పడుతున్నానని... తాజాగా నిర్మల్ కు చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి మొరపెట్టుకున్నాడు. తక్షణమే తనను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ... ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు రాథోడ్ నాందేవ్. తనను స్వదేశానికి తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరాడు.
ముధోల్ మండలం రువి గ్రామానికి చెందిన రాథోడ్ రాందేవ్ గత తొమ్మిది నెలల కిందట కువైట్ వెళ్లాడట. అయితే ఇంట్లో పని అని చెప్పి... ఓ ఏజెంట్ మోసం చేశాడట. కువైట్ వెళ్లిన తర్వాత... ఎడారిలో ఒంటరి కాపరిగా పనిలో పెట్టాడట. ఇలా తనను... ఎడారిలో ఉంచి కొడుతున్నారని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. మరి ఈ వీడియో పై తెలంగాణ ముఖ్యమంత్రి... రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









