ట్రావెల్ ఏజెంట్లతో తస్మాత్ జాగ్రత్త...ఇండియా కాన్సులేట్ వార్నింగ్...!
- August 09, 2024
అమెరికా: భారత సంతతికి చెందిన వ్యక్తులు తప్పుడు ట్రావెల్ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ హెచ్చరికలు జారీ చేసింది. వారు కాన్సులర్ సేవలకు అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారని వెల్లడించింది. కొన్ని సందర్భాలలో వారు తప్పుడు పత్రాలను సమర్పిస్తున్నారని తెలియజేసింది.
ముఖ్యంగా ఓసీఐ కార్డుల సేవలకు భారీగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ బినాయ ప్రధాన్ పలు అంశాలను ప్రస్తావించారు. కేవలం 17 డాలర్లు విలువ చేసే ఎమర్జెన్సీ ధ్రువీకరణలకు వారు 450 డాలర్లు చార్జీ చేస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు వాస్తవానికి ఎటువంటి ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం లేదని ప్రధాన్ పేర్కొన్నారు. వారు నేరుగా కాన్సులేట్ లో సంప్రదించవచ్చన్నారు. సేవల కోసం మీరు నేరుగా మా కార్యాలయానికి రావచ్చు.
దళారులు వారికి ఆదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. గతంలో దరఖాస్తుదారుల తరపున ఏజెంట్లు తప్పుడు బిల్లులు, ధ్రువీకరణలు, అడ్రస్ లు సమర్పిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలు చివరివరకు దరఖాస్తుదారులకు తెలియజేయడం లేదన్నారు. భారతీయ చట్టాలను ఉల్లంఘించి.... దరఖాస్తుదారులను ప్రమాదంలో పడేస్తున్నారని చెప్పారు. స్కామ్ ల నుంచి తప్పించుకునేందుకు కేవలం ఈ-వీసా వెబ్సైట్ ను మాత్రమే వాడాలని ప్రధాని సూచించారు. దాదాపు 140కి పైగా ఈ-వీసా తప్పుడు వెబ్సైట్లను గుర్తించామన్నారు. ఇవి ప్రభుత్వ సైట్లను తలపిస్తున్నట్లే ఉన్నాయని పేర్కొన్నారు.
--సాయి కృష్ణ(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







