తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- August 10, 2024
హైదరాబాద్: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతో సంప్రదింపులు ఏమీ లేవని చెప్పారు. అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీడియాకే చెబుతానంటూ కిషన్ రెడ్డి అన్నారు. సామాజిక అసమానతల కారణంగా దళిత రిజర్వేషన్లు ఇచ్చారు. క్రిమీలేయర్ విషయంలో ఆలోచించమని చెప్పింది తప్ప ఆదేశించలేదు. ప్రస్తుతం ఏ పద్ధతి కొనసాగుతుందో అదే పద్ధతి కొనసాగుతుందని కిషన్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఇళ్లను తీసుకోలేదు. నిన్నటి కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రాంతంలో మూడు లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఇళ్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపాదనలు రాగానే ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా ప్రధానిని కోరానని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నాం. అధ్యక్ష మార్పు అంశం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధం లేదని అన్నారు. జమ్ము-కాశ్మీర్ పర్యటనకు త్వరలో వెళ్తున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్లోలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!