కేరళ సీఎంతో కలిసి వయనాడ్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే
- August 10, 2024
వయనాడ్: ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్తో కలిసి భారత వైమానిక దళ హెలికాప్టర్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. చూరల్మల, ముండక్కై, పూంచిరిమట్టం గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
సర్వే అనంతరం ప్రధాని మోడీ కల్పేటలోని ఎస్కేఎంజే హయ్యర్ సెకండరీ స్కూల్లో దిగారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు వెళుతున్నారు. వారి వెంట కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మోడీ కొండచరియలు విరిగిపడిన చూరల్మల గ్రామానికి వెళ్లవలసి ఉంది. మోదీ 24 కిలో మీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది.
ప్రభావిత ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరిస్తారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకుముందు, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 11 గంటలకు దిగిన ప్రధానికి సీఎం, గవర్నర్ స్వాగతం పలికారు. వీరంతా వైమానిక దళ హెలికాప్టర్లో వయనాడ్ బయలుదేరారు.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









