RTA నోల్ కార్డ్.. కనీస టాప్-అప్ Dh50కి పెంపు
- August 17, 2024
దుబాయ్: ఇకపై మెట్రో స్టేషన్ల నోల్ కార్డ్ కోసం కనీస టాప్-అప్ Dh50గా నిర్ణయించారు. ఇది ఇంతకుముందు Dh20గా ఉండే. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) శుక్రవారం Xలో పోస్ట్ చేసింది. అయితే, ఆన్లైన్లో తమ కార్డులను టాప్ అప్ చేసే ప్రయాణికులకు ఇది వర్తించదని పేర్కొంది. "ఆగస్టు 17నుండి మెట్రో స్టేషన్ టిక్కెట్ ఆఫీసులలో కనీస టాప్-అప్ AED 50కి పెరుగుతుంది" అని RTA పోస్ట్లో పేర్కొంది.
మెట్రో ట్రాన్సిట్ నెట్వర్క్లో రౌండ్ ట్రిప్ను కవర్ చేయడానికి ప్రయాణికులు వారి నోల్ కార్డ్లో 15 దిర్హామ్ల బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డ్గా, దుబాయ్ మెట్రో, బస్సులు, ట్రామ్లు మరియు వాటర్బస్సులతో సహా దుబాయ్ అంతటా ప్రజా రవాణా కోసం చెల్లించడానికి నోల్ కార్డ్ ఉపయోగించబడుతుంది. టాక్సీ ఛార్జీలు, పార్కింగ్, దుబాయ్ పబ్లిక్ పార్క్లకు ప్రవేశం, ఎతిహాద్ మ్యూజియం, నగరం చుట్టూ ఉన్న 2,000 కంటే ఎక్కువ దుకాణాలు, రెస్టారెంట్లు మరియు స్టోర్లకు చెల్లించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







