శివాజీ–లయ జంటగా కొత్త సినిమా..
- August 18, 2024
            హైదరాబాద్: గతంలో శివాజీ–లయ కలిసి చేసిన ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘అదిరిందయ్యా చంద్రం’.. సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ ఇద్దరు కూడా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివాజీ ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది.
ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శివాజీ – లయ ఇప్పుడు మళ్ళీ కలిసి నటించబోతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ లయ జంటగా కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి శివాజీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్ చేసారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 20 నుంచి మొదలు కానుంది. ఒకప్పటి సూపర్ హిట్ పెయిర్ శివాజీ–లయ మళ్ళీ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







