శ్రీవారి సేవలో మంత్రి టిజి భరత్‌

- August 20, 2024 , by Maagulf
శ్రీవారి సేవలో మంత్రి టిజి భరత్‌

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్‌ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ… సిఎం చంద్రబాబు ఒక పారిశ్రామిక బ్రాండ్‌ అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు తరలి వస్తున్నాయని తెలిపారు. రెండు లక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీ సిటీలో పలు సంస్థల ప్రారంభోత్సవం చేశారని తెలిపారు. వంద రోజుల ప్రభుత్వంలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com