భారతీయ పర్యాటకుల కోసం ఒమన్ ప్రమోషనల్ సెమినార్లు..!
- August 21, 2024
మస్కట్: ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ భారతదేశంలో ప్రచార సెమినార్లను నిర్వహిస్తోంది. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి మొబైల్ ప్రచార సదస్సు ప్రారంభమైంది. న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు బెంగుళూరు అనే నాలుగు ప్రధాన నగరాల్లో ఈవెంట్లు జరుగుతున్నాయి. సెమినార్లలో సుందరమైన ప్రకృతి, ఆకర్షణీయమైన గమ్యస్థానాలు, ఒమన్ సుల్తానేట్ను పర్యాటకులకు కేంద్రంగా మార్చే వైవిధ్యమైన అనుభవాలను పరిచయం చేస్తున్నారు. హెరిటేజ్ అండ్ టూరిజం ఫర్ టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిజ్ ఎక్సలెన్సీ అజ్జాన్ బిన్ ఖాసిమ్ అల్ బుసైది మాట్లాడుతూ.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద పర్యాటక వనరులలో ఒకటి. ఒమన్ సుల్తానేట్ సందర్శకుల సంఖ్య గత సంవత్సరంలో 2023 600,000 దాటింది. ప్రస్తుత సంవత్సరం 2024లో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







