కనెక్టింగ్ ఫ్లైట్‌.. విమాన ఛార్జీలలో 70% పైగా ఆదా..!

- August 21, 2024 , by Maagulf
కనెక్టింగ్ ఫ్లైట్‌.. విమాన ఛార్జీలలో 70% పైగా ఆదా..!

యూఏఈ: వేసవి సెలవులు ముగియడంతో, యూఏఈకి తిరిగి వస్తున్న కొంతమంది నివాసితులు అధిక విమాన ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాగా  పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి,  అదనపు ప్రయాణ సమయం ఉన్నప్పటికీ, ఇతర దేశాలలో లేఓవర్‌లతో విమానాలను కనెక్ట్ చేయడాన్ని ఎంచుకుంటున్నట్లు వెల్లడించారు.

అమ్మర్ బి, వ్యాపారవేత్త మరియు అబు హైల్ నివాసి.తన కుటుంబంతో కలిసి దుబాయ్‌కి తిరిగి వస్తున్నాడు. అతను మంగుళూరు నుండి దుబాయ్‌కి డైరెక్ట్ ఫ్లైట్ కోసం దాదాపు రూ.300,000 (Dh13,150) ఖర్చు చేశాడు. అయినప్పటికీ, మస్కట్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్‌ని ఎంచుకోవడం ద్వారా అతను ఖర్చును దాదాపు సగానికి తగ్గించగలిగాడు. “మేము వేసవి సెలవులకు బయలుదేరినప్పటి నుండి ప్రత్యక్ష విమానాల ధర దాదాపు రెట్టింపు అయ్యింది. మస్కట్ మీదుగా ఒక మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మేము ఛార్జీలలో తగ్గింపు పొండగలిగము.”అని అమ్మర్ చెప్పారు. అమ్మర్ తన భార్య, ఐదుగురు పిల్లలు మరియు తల్లిదండ్రులతో మొత్తం తొమ్మిది మందితో ఆగస్టు 24న ప్రయాణం బుక్ చేసుకున్నారు. “డైరెక్ట్ ఫ్లైట్ కోసం, ఒక్కో టికెట్ ధర రూ.35,000 (దిర్హాన్ 1,534), కానీ మస్కట్‌కు విమానాలను బుక్ చేయడం ద్వారా, ఒక్కో టికెట్‌కు కేవలం రూ.12,000 (దిర్హాన్‌524) ఖర్చవుతుంది. మేము ఈ మార్గంలో 70 శాతానికి పైగా ఆదా చేస్తున్నాము.”అని అమ్మర్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com